![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -241 లో...... నగలు విషయం బయటపెట్టాలని ప్రేమ, నర్మద అనుకుంటారు. కానీ భాగ్యం వాళ్ళ ప్లాన్ ని తిప్పికొడుతుంది. గిల్టీ నగలు అన్ని ఒక కలశంలో పెడుతుంది ఆ కలశం పూజ దగ్గరికి తీసుకొని వస్తుంది. శ్రీవల్లి అందులోనే అన్ని నగలు ఉన్నాయని చెప్తుంది. నగలు అందులో నుండి తియ్యమని శ్రీవల్లితో చెప్తుంది నర్మద. అందరు నగలు అందులో నుండి తియ్యాడానికి ట్రై చేస్తారు కానీ అందులోకి ఎవరి చెయ్యి దూరదు.
సాగర్, ధీరజ్, చందు ట్రై చేస్తారు వాళ్ళ వల్ల కూడా కాదు. నేను ట్రై చేస్తాను అంటూ తిరుపతి ట్రై చేస్తాడు కానీ ఆతని చెయ్యి అందులోనే ఉండిపోతుంది. ఇక ఏం చెయ్యలేక అలాగే పూజ పూర్తి చేస్తారు. ఆ తర్వాత చాలా మంచి ప్లాన్ చేసావ్ అమ్మ అని శ్రీవల్లి భాగ్యాన్ని పొగుడుతుంది. ఇంకొకసారి వాళ్ళు నీ జోలికి రారు అని శ్రీవల్లితో భాగ్యం చెప్తుంది. ఆ తర్వాత ఆనందరావు దగ్గరికి ప్రేమ, నర్మద వస్తారు. బాబాయ్ మీతో కొన్ని సెల్ఫీ తీసుకుంటానని ప్రేమ అనగానే ఆనందరావు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే అంటాడు
బాబాయ్ నేను ఫోన్ తీసుకొని రాలేదు.. మీ ఫోన్ ఇవ్వండి అని నర్మద అంటుంది. అతను ఫోన్ ఇస్తాడు. సెల్ఫీ తీసుకుంటారు. బాబాయ్ నాకు ఈ ఫొటోస్ పంపించండి అని నర్మద అంటుంది. నువ్వు పంపించుకోమని ఆనందరావు అనగానే నర్మద అతని ఫోన్ లో లొకేషన్ ఆన్ చేసి షేర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆనందరావు భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్లి ఇల్లు కాళీ చేస్తుంటారు. ఎప్పుడు అయిన వాళ్ళు ఇక్కడికి వస్తారని భాగ్యం అనుకుంటుంది. అప్పుడే ప్రేమ, నర్మద కలిసి భాగ్యం ఇంటికి వస్తారు. వాళ్ళని చూసి షాక్ అవుతారు. ఇంత జాగ్రత్త పడ్డాం కదా మా అడ్రెస్ ఎలా దొరికిందని నర్మదని ఆనందరావు అడుగుతాడు. నర్మద లొకేషన్ షేర్ చేసుకుంది చూపిస్తుంది. ఇప్పుడే మీ విషయం మావయ్యకి చెప్తామని ప్రేమ, నర్మద అక్కడ నుండి బయల్దేర్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |